రైసింగ్ డే వేడుకల్లో విజయనగరం అమ్మాయిల నృత్య ప్రదర్శన
పంజాబ్లో మిలటరీ సిబ్బంది ఏర్పటు చేసిన 57వ
రైజింగ్ డే వేడుకలలో విజయనగరం కళాకారిణులు
పాల్గొన్నారు. కుమారి. బి. వైష్ణవి, ఆమె సోదరి
అయిగిరినందిని అనే మహిషాసుర మర్ధిని పాటకు
భరతనాట్య నృత్య ప్రదర్శన చేసి మిలటరీ సిబ్బంది
చేత ప్రశంసలు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న
ప్రేక్షకులు కూడా మెచ్చుకున్నారు. అనంతరం మిలటరీ
వారు ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చి కళాకారిణులను
సత్కరించారు.